हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Telanagana Budget: గ్యారంటీలకు నిధులు లేవు కేటీఆర్

Ramya
Telanagana Budget: గ్యారంటీలకు నిధులు లేవు కేటీఆర్

బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ అసంతృప్తి

తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏ ఒక్క రంగానికీ సమర్థమైన బడ్జెట్ కేటాయింపులు లేవని, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించకపోవడం వాటిని అటకెక్కించినట్టేనని ఆరోపించారు. బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, వృద్ధుల పెన్షన్, రైతు సంక్షేమానికి సరైన నిధులు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చే పరిస్థితి లేదని బడ్జెట్ స్పష్టంగా చూపిస్తోందని విమర్శించారు.

గ్యారంటీలకు తిలోదకాలు ఇచ్చిన కాంగ్రెస్

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలపై అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్‌లో మాట్లాడిన కేటీఆర్, బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా విస్మరించారని అన్నారు. భట్టి విక్రమార్క గంటన్నర పాటు బడ్జెట్‌పై ప్రసంగించినా, తుదకు కేటాయింపులు మాత్రం శూన్యంగా తేలాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను సజీవంగా అమలు చేయడం దూరంగా, వాటి ప్రస్తావన కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “ఆరు గ్యారంటీల ఊసే బడ్జెట్‌లో లేదు, అవి గోవింద.. గోవిందా.. అంటూ గాలిలో కలిసిపోయాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను పూర్తిగా పక్కన పెట్టినట్టేనని స్పష్టం చేశారు.

మహిళా సంక్షేమ నిధులకు ఒక్క రూపాయి కూడా కేటాయింపుల్లేవు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రతి నెలా ₹2,500 ఆర్థిక సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక అది అసలు అమలుకాకుండా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం మహిళలను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. మహిళల ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నదని దుయ్యబట్టారు. “మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని మోసం చేసి ఓట్లు తీసుకున్నారు, కానీ బడ్జెట్‌లో నిధులే కేటాయించలేదు” అంటూ ధ్వజమెత్తారు.

వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ కలుగజేస్తామని మోసం

ఎన్నికల సమయంలో వృద్ధులకు ప్రతి నెలా ₹4,000 పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బడ్జెట్‌లో ఆ పథకానికి తగిన నిధులు కేటాయించలేదని కేటీఆర్ ఆరోపించారు. వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీ పూర్తిగా వృథా అయినట్టేనని అన్నారు. “500 రోజుల్లో పింఛన్ అమలు చేస్తామన్నారు, కానీ బడ్జెట్ చూస్తే ఇప్పుడు అది పూర్తిగా గల్లంతైనట్టే” అని విమర్శించారు. వృద్ధులు ఇప్పుడు తమకు హామీగా ఇచ్చిన ₹4,000 పింఛన్ రాదని అర్థం చేసుకుని తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు.

కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారని, అయితే ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. బడ్జెట్ చూస్తే ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి కేవలం అధికార భోగభాగాలను ఆస్వాదించే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870