Ashok Leyland plant to be inaugurated in AP today

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఈరోజు సాయంత్రం 5గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. భారీ పెట్టుబడులతో మల్లవల్లిలో బస్సు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ప్రారంభంతో రాష్ట్రానికి మరో కీలక పరిశ్రమ రానుంది. ప్లాంట్ ద్వారా ఏపీలో ఆటోమొబైల్ రంగానికి జోష్ రానుంది. మల్లవల్లి యూనిట్ నుంచి దేశవ్యాప్తంగా బస్సుల సరఫరా ఉంటుంది.

నేడు ఏపీలో అశోక్ లేలాండ్

1200 మందికి ఉద్యోగాలు

పరిశ్రమల విస్తరణలో మరో మెట్టుపై ఏపీ నిలువనుంది. తొలివిడతలో 600మందికి, మలివిడతలో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో అశోక్‌ లేల్యాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో ఆ సంస్థ ఎలక్ర్టికల్‌ బస్‌ బాడీ బిల్టింగ్‌ ప్లాంట్‌ నెలకొల్పింది. దీనిని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసేలోపు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం అశోక్‌ లేల్యాండ్‌కు తగిన సహకారం ఇవ్వలేదు.

మొట్టమొదటి ఆటోమొబైల్‌ ప్లాంటు ఇది

కొవిడ్‌ అనంతర పరిస్థితులు కూడా ప్లాంట్‌ కార్యకలాపాలకు ఆటంకంగా మారాయి. కూటమి ప్రభు త్వం వచ్చాక అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ప్లాంట్‌ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఎలక్ర్టికల్‌ బస్సులే కాకుండా అన్ని రకాల బస్సులకు బాడీ బిల్డింగ్‌ చేసే దిశగా ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి ఆటోమొబైల్‌ ప్లాంటు ఇది. ఈ ప్లాంట్‌లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు బీఎస్‌- 6 మోడళ్ల బస్సులను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు ఫేజ్‌-1, 2లలో సంవత్సరానికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.

Related Posts
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Disqualification case of Telangana MLAs.. KTR to Supreme

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం Read more

ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి
ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాల కోన వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గుండాలకోన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు Read more

Tenth board exams 2025:టెన్త్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
టెన్త్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్! ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులో

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 17న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు Read more

అన్నింటికంటే పోలీసు శాఖ అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Speech in Police Commemorative Day

విజయవాడ: నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విధి నిర్వహణలో చాలా మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *