Land scam took place in Amaravat.. Botcha Satyanarayana

అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

అమరావతి: మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు. మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగాం విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పాం.

Advertisements
అమరావతిలో జరిగింది భూ స్కాం

ప్రభుత్వానికి దశ, దిశా లేదు

ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయనని కోరుతున్నాం. ప్రభుత్వానికి దశ, దిశా లేదు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదు. 2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం కదా. డిజిటల్ కరెన్సీ పై మాట్లాడారు.. అది సరైనది కాదు. మాపై వచ్చిన ఆరోపణలు మేం ఖండించడం లేదు.. సమర్ధించడం లేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నాం. మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారు.

ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం

సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పాం. అమరావతిలో జరిగింది భూ స్కాం. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం. వైసీపీ మీద.. మా నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే మేం సభ నుంచి వాకౌట్ చేశాం అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Related Posts
మణిపూర్ సీఎంని తొలగించండి : ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యేలు లేఖ
Remove Manipur CM. BJP MLAs letter to Prime Minister

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ Read more

ఎక్నాథ్ షిండే ఎన్నికలలో విజయం సాధిస్తామని తెలిపారు
Ekanth Shinde

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్నాథ్ షిండే, తమ ఓటును థానే జిల్లాలో వేసిన తరువాత, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. "మహా Read more

Wakf Bill: రాజ్యసభ ముందుకు నేడు వక్ఫ్‌బోర్డు
Wakf Bill: రాజ్యసభ ముందుకు నేడు వక్ఫ్‌బోర్డు

లోక్‌సభ వక్ఫ్‌ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. Read more

క్యాంపస్ విద్యార్థుల అథ్లెటిక్ ప్రతిభ
Students of KLH Bachupally Campus who achieved excellence in displaying outstanding athletic talent

హైదరాబాద్: అత్యుత్తమ క్రీడా విజయాలు మరియు విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది. తామెంచుకున్న రంగాలలో రాణిస్తున్న విద్యార్థి-అథ్లెట్లకు ప్రోత్సాహక మైదానంగా Read more

×