హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాలు -1లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వస్తున్న తరుణంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.

ప్రతిప్రక్షాలు చేసే ప్రచారంపై చర్చ
కాగా, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ శాసనసభ సభ్యులు, శాసమండలి సభ్యులు హాజరుకానున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కొవడం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమాచారం, ప్రతిప్రక్షాలు చేసే ప్రచారంపై ఆధారాలతో సిద్దంగా ఉండటం తదితర అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం.
ఈ నెల 19వ తేదీన బడ్జెట్
పార్టీ చట్ట సభల ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేయనున్నారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 19వ తేదీన బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.