కర్ణాటకలో విదేశీ మహిళపై దారుణం – నిందితుల కోసం గాలింపు!

టూరిస్ట్ మహిళ అత్యాచారం వేగంగా దర్యాప్తు

కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో విదేశాలకు చెందిన పర్యాటకులు దుండగుల దాడికి గురికావడం, ఓ వ్యక్తి మృతిచెందడం, ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

Advertisements
i5gf39dg karnataka gangrape 160x120 08 March 25

ఘటన వివరాలు

గురువారం నాడు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి, అమెరికాకు చెందిన ఓ యువకుడు, మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ అనే వ్యక్తులు కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. వీరంతా ఆనెగుందిలోని అంబికా నాయక్ హోం స్టేలో బస చేశారు. పర్యటనలో భాగంగా రాత్రి సమయం వద్ద సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించడంతో పాటు అక్కడ ఆనందంగా గడిపారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ ప్రదేశానికి చేరుకుని, ముందుగా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందంటూ వారితో మాటలు కలిపారని అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. దానికి పర్యటకులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దుండగులు పర్యటకులపై దాడి చేసి, పంకజ్, బిబాస్, డేనియల్ను పక్కనే ఉన్న కాలువలోకి తోసేశారు. పంకజ్, డేనియల్ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్ నీటి ఉద్ధృతికి గల్లంతయ్యాడు. పురుషులను కాలువలోకి తోసి మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారని తెలిపారు. ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై కొప్పల్ జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోంస్టే, సంఘటన ప్రదేశం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హోంస్టే యజమాని సహా స్థానిక ప్రజల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన మహిళల వైద్య పరీక్షలు నిర్వహించగా, నివేదిక అధికారులకు అందినట్లు సమాచారం. సూపరింటెండెంట్ రామ్ ఎల్ అరసిద్దికి ఫిర్యాదు చేసినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి నిందితుల కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని నిందితులను త్వరగా అరెస్టు చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.

Related Posts
Secunderabad : సికింద్రాబాద్ లో యువ వైద్యుడి ఆత్మహత్య.. ఎందుకంటే!
Secunderabad : సికింద్రాబాద్ లో యువ వైద్యుడి ఆత్మహత్య.. ఎందుకంటే!

సికింద్రాబాద్‌లో ఓ యువ వైద్యుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వయస్సు పెరుగుతున్నా వివాహం కాకపోవడం, నిశ్చితార్థం అయ్యాక సంబంధం రద్దవడం Read more

BettingApps : ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎందుకంటే!
ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు Read more

Ranyarao: రన్యా రావుతో ఇద్దరు మంత్రుల లింక్‌.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Ranyarao: బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. రన్యా రావు కేసులో మంత్రుల ప్రమేయం?

నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ అయ్యింది. ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ Read more

Canada: కెనడాలో భారతీయుడి దారుణహత్య
కెనడాలో భారతీయుడి దారుణహత్య

సంఘటన స్థలం: ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్కెనడాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది, ఇందులో ఒక భారతీయుడు ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్ ప్రాంతంలో కత్తిపోట్లకు గురై మరణించాడు.పోలీసుల Read more

×