బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజీ వివాదం విద్యా రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పేపర్ బయటకు వచ్చేసిన వార్త విస్తృత చర్చకు దారి తీసింది.ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేపర్ లీక్ గురించి తెలుసుకున్న వెంటనే ఉన్నత విద్యా శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. విచారణను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించడంతో పాటు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisements
బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్
బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

విద్యార్థుల హితాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలికాకుండా పరీక్షల నిర్వహణ విధానాన్ని మరింత కఠినతరం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రశ్నాపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, తద్వారా ఈ తరహా సమస్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై పరీక్షా పత్రాల భద్రతను మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వివాదం ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూడాలి.

Related Posts
నేడు పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో Read more

ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు – ఏప్రిల్ 1 వరకు అమలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 'సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర' కిట్లు అందించనుంది. ఈ కిట్ల Read more

సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం
సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం

వాణిజ్యం, సుంకాల సంబంధిత అంశాలపై చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. వైట్‌హౌస్‌లో Read more

తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి – పవన్
భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేసాం - పవన్

తమిళనాడులో హిందీ భాషపై వ్యతిరేకత కొనసాగుతున్న సమయంలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా Read more

×