We have not received a response from India to our request.. Yunus

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక సమాధానమేదీ రాలేదని తెలిపారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌లో ఆమె తలదాచుకుంటున్నారు. హసీనాతో పాటు ఆమె హయాంలోని పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, పలువురు అధికారులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ వారిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. హసీనాతో పాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులపై విచారణ జరుగుతుంది అని యూనస్ వెల్లడించారు.

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌

ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము

అలాగే తమ అప్పగింత అభ్యర్థనపై భారత్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని చెప్పారు. షేక్‌ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ లేఖ రాసిన విషయాన్ని భారత్‌ ఇప్పటికే ధ్రువీకరించింది. షేక్‌ హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్‌ హై కమిషన్‌ నుంచి లేఖ అందింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో.. హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగట్లేదని అన్నారు. యూనస్ ఓ ఉగ్రవాది అని విమర్శించారు. ఆమెను తమ దేశంలోకి రప్పించడమే తమ అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని ఆ వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది.

Related Posts
దేశప్రజలకు మోడీ శుభాకాంక్షలు
దేశప్రజలకు మోడీ శుభాకాంక్షలు

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఆసక్తి ఉన్న భారతదేశం యొక్క మానసిక స్థితిని ప్రతిబింబిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం X లో ఒక పోస్ట్‌లో దేశప్రజలకు నూతన Read more

కులగణనపై పీసీసీ ప్రజెంటేషన్
Caste Census bhatti

ఎస్సీలను వర్గీకరించాలా? లేక సమూహంగా కొనసాగించాలా?.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ Read more

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆమ్ Read more

డిపోల ప్రైవేటీకరణ పై TGSRTC క్లారిటీ
TSRTC Clarity on Privatizat

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్ బస్సుల పేరిట డిపోల ప్రైవేటీకరణ జరుగుతోందన్న ప్రచారాన్ని ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మినహా ఇతర కార్యకలాపాలు మొత్తం ఆర్టీసీ Read more