చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీఫైనల్ ఉత్కంఠ భరితంగా మారింది. ముఖ్యంగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తృటిలో ఔట్ కాకుండా తప్పించుకున్న ఘటన అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్లో 14వ ఓవర్ చివరి బంతికి స్మిత్ అవుట్ కాకుండా తప్పించుకోవడం క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది. ఐసీసీ నియమాల కారణంగా అతను ఔట్ కాకుండా నిలబడటం క్రికెట్ నిబంధనలపై ఆసక్తికరమైన చర్చలకు దారితీసింది.
ఐసీసీ నియమాల ప్రకారం అవుట్ ఎందుకు కాలేదు?
ఎంసీసీ చట్టం 29 ప్రకారం – వికెట్ తీసివేయబడిందని పరిగణించడానికి కనీసం ఒక బెయిల్ పూర్తిగా తొలగించబడాలి. ఈ కారణంగా స్మిత్ను అవుట్గా ప్రకటించలేదు. ఈ సంఘటనలో, బంతి స్టంప్ను తాకినప్పటికీ, బెయిల్స్ కదలలేదు. 4వ ఓవర్ చివరి బంతి – భారత బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ స్ట్రైక్లో ఉన్నాడు. ఇది స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్మిత్ రక్షణాత్మకంగా ఆడిన బంతి ప్యాడ్ను తాకి స్టంప్స్ను తాకింది. అయితే, బెయిల్స్ పడలేదు, దాంతో స్మిత్ అవుట్ కాకుండా మిగిలిపోయాడు.
ముందు రనౌట్ మిస్
14వ ఓవర్లో జరిగిన ఈ సంఘటనకు ముందు, స్మిత్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.షార్ట్ ఫైన్ లెగ్ వైపు షాట్ ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా,మార్నస్ లాబుస్చాగ్నే పరుగు తీయడానికి నిరాకరించాడు. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి బంతిని అందుకోలేకపోవడంతో స్మిత్ క్రీజులోకి సురక్షితంగా చేరాడు. 22వ ఓవర్లో, భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ మిస్ అయింది.ఇది ఆసీస్ జట్టుకు మరింత స్థిరపడే అవకాశం ఇచ్చింది. అభిమానులు, విశ్లేషకులు స్మిత్ లక్ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. నక్కతోక తొక్కి వచ్చింది అంటూ మేమ్స్ వైరల్ అయ్యాయి.ఐసీసీ నిబంధనలు సరైనవేనా? అనే చర్చ కూడా మొదలైంది. ఈ నిర్ణయం మ్యాచ్ను ఎంతవరకు ప్రభావితం చేసిందో,భారత్ పైన దీని ప్రభావం ఏమిటో చూడాలి.