Indrakeeladri Ammavari saree scam.. High Court issues key orders

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్ : హైకోర్టు కీలక ఆదేశాలు

విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి లో 33,686 వేల చీరలు మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీరల స్కామ్‌ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే నిర్ధారించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో రూ.కోట్లలో అవినీతి జరిగిందని, రూ.1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగినట్లు గుర్తించారు.

Advertisements
ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్

ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు

అయితే చీరల అమ్మకాల బాధ్యతలు ఈవో, జూనియర్ అసిస్టెంట్ నిర్వహించారు. ఈ మేరకు గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వైరీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు పూర్తి ఎంక్వైరీ జరిగే వరకూ పెనాల్టీ గానీ, చర్యలుగాని తీసుకోవద్దని తీర్పు వెల్లడించింది.

హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు

కాగా చీరల స్కామ్ అభియోగంపై సుబ్రహ్మణ్యాన్ని గతంలో దేవాదాయ శాఖ పలుమార్లు విధుల నుంచి సస్పెన్షన్ వేటు వేసినా వైసీపీ నేతల తోడ్పాటుతో మళ్లీ విధుల్లో చేరారు. ఇక స్కామ్‌పై ప్రత్యేక కమిటీతో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఇంద్రకిలాద్రిపై ఈ కమిటీ విచారణ జరపనున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సుబ్రహ్మణ్యంకు స్వల్ప ఊరట లభించినట్లైంది.

Related Posts
బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్
బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్

ఏపీ శాసనమండలిలో ఆసక్తికర వాగ్వాదం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. Read more

నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా !
Rythu Bharosa for farmers who have less than 3 acres from today!

రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ హైరదాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. ఈ Read more

ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ
ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడం తో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో యనమల Read more

USA: పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్
USA పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్

USA: పోలాండ్ లో విజ్ఞప్తికి నో చెప్పిన ట్రంప్ రష్యా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు తమ దేశంలోనే అమెరికా అణ్వాయుధాలను మోహరించాలని కోరిన పోలాండ్ అభ్యర్థనకు Read more

×