Revanth Reddy.. Secret agreement with Modi.. Jagadishwar Reddy

రేవంత్ రెడ్డి.. మోడీతో రహస్య ఒప్పందం : జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌: రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ కీలక ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..మోడీని కలసి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ మెదలు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. మోడీ ఏజంట్ గా మాట్లాడుతున్నారు. రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ బాంబ్‌ పేల్చారు. మోడీని కలసొచ్చాక కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ దాడి తీవ్రతరం చేశాడని చురలకు అంటించారు.

Advertisements
image

మోడీ భజన చేస్తూ..

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పంచాయితీ మోడీ ఏ టీం, మోడీ బీ టీం మాదిరి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మోడీతో రహస్య ఒప్పందం చేసుకుని వచ్చాడని వెల్లడించారు. రాహుల్ గాంధీకి అర్థం అవుతుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. మోడీ తెలంగాణకు నిధులు ఇస్తానంటే కిషన్ రెడ్డి ఆపితే ఆగుతదా ? మోడీ భజన చేస్తూ.. రేవంత్ బహిరంగంగా దొరికిపోతున్నాడన్నారు. పదవి, ఆస్తులు కాపాడుకోవటానికే రేవంత్ మోడీ భజన చేస్తున్నాడని ఆగ్రహించారు. హరీష్ రావుపై సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు.

పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా?

కాగా, పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టారని బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్లే కుప్పకూలిందని రేవంత్ ఆరోపించారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా? అని కేటీఆర్, హరీశ్ రావు, కవితపై మండిపడ్డారు. మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రధాని మోడీ ఇచ్చారు.. నేనే తెచ్చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో రాలేదు.. మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు.. ఆపింది మోడీనేనా అని రేవంత్ ప్రశ్నించారు.

Related Posts
యలమందలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ
Distribution of Chandrababu pensions in Yalamanda

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన యల్లమందలోని పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా Read more

హెచ్‌ఎమ్‌పివి వైరస్‌కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు
హెచ్‌ఎమ్‌పివి వైరస్‌కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు

హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్‌ఎమ్‌పివి) చికిత్సకు యాంటీబయాటిక్స్ పనిచేయవని, తేలికపాటి ఇన్ఫెక్షన్లకు సరైన ఆర్ద్రీకరణ, పోషకాహారం, రోగ లక్షణాల ఆధారంగా నిర్వహణ చేయాలని డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. Read more

దీపావళికి ముందు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..ప్రజల ఇబ్బందులు
Increased air pollution in Delhi before Diwali.People problems

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, Read more

గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు
srireddy

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని Read more

×