ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

కీవ్ : ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ట్రంప్‌ తో భేటీ వివాదంగా మారడంతో ఆ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకొని బయటకు వచ్చేశారు జెలెన్‌స్కీ. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన అగ్రరాజ్యంతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధమేనన్నారు. అంతేకాదు.. అమెరికాకు ఉక్రెయిన్‌ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు.

Advertisements
ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ నేను సిద్ధమే

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం జరిగింది. ఇందులో జెలెన్‌స్కీ పాల్గొన్నారు. అనంతరం తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. అమెరికా తో సత్సంబంధాలను కాపాడుకోగలను. నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తా. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ నేను సిద్ధమే. ఖనిజాల ఒప్పందంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకు నేను సిద్ధమే అని జెలెన్‌స్కీ వెల్లడించారు.

వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యం

అనంతరం సామాజిక మాధ్యమాల్లో వీడియో సందేశం విడుదల చేశారు. ఐరోపా నుంచి మాకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైంది. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యం. యూకే, ఐరోపా సమాఖ్య, తుర్కియే వంటి దేశాలు దీనిపై కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇక్కడ అమెరికా ప్రాధాన్యతను కూడా మనం అర్థం చేసుకోవాలి. యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి మాకు అందుతున్న సాయంపై మేం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారికి కృతజ్ఞతలు తెలపని రోజు లేదు. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదాలు. సుదీర్ఘ యుద్ధం కాదు.. మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని మేం చెబుతున్నాం అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Related Posts
Chandrababu Naidu: ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ చైర్మన్
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్ర అభివృద్ధిపై, భక్తుల సంక్షేమం గురించి చర్చించిన ఈ సమావేశంలో, Read more

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు దక్కని ఊరట
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై బుధవారం మధ్యాహ్నం కోర్టు Read more

ఇంకా ప్రమాదంలోనే పోప్ ఆరోగ్యం
popes health still in danger

న్యుమోనియాతో పోరాడుతున్న పోప్ రోమ్‌: పోప్ ఫ్రాన్సిస్‌(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్‌లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య Read more

ఇంకా మారకపోతే మార్చురీకి పోతారు: కవిత
kavitha comments on cm revanth reddy

హైరదాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు Read more

×