Spadex experiments to resume from March 15.. ISRO

మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు పునఃప్రారంభం : ఇస్రో

ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతం

న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా నింగిలోనే ఉపగ్రహాలను అనుసంధానించే ప్రత్యేక మిషన్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించిన ఇస్రో, ఈ ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు చేపట్టనున్నట్లు నారాయణన్ వెల్లడించారు.

Advertisements
మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు

ప్రయోగాల ప్రణాళిక

ప్రస్తుతం ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. వివిధ ప్రయోగాలను నిర్వహించేందుకు వచ్చే రెండు నెలల్లో 10 నుంచి 15 రోజుల అనుకూల సమయం ఉంటుంది.ప్రస్తుతం ఉపగ్రహాలను విడదీసి, రీ-డాకింగ్‌ చేసే అనుకరణ ప్రయోగాలు చేపట్టుతున్నాం. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం” అని ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్ తెలిపారు. ఇస్రో చీఫ్‌ ప్రకారం,ఉపగ్రహాల్లో తగినంత ఇంధనం ఉంది కాబట్టి మరిన్ని ప్రయోగాలను చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే,రెండు నెలల తర్వాత మరో అనుకూల సమయంలో మూడో దశ ప్రయోగాలను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

భారత్ ఘనత

డాకింగ్‌, దృఢత్వ ప్రయోగాల అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్‌ శక్తి బదిలీకి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు వేస్తూ ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా,2023 డిసెంబర్ 30న ఛేజర్‌,టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పలు ప్రయత్నాల అనంతరం,జనవరి 16న డాకింగ్‌ ప్రక్రియ స్పేడెక్స్‌ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.

Related Posts
వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సర్పంచ్ సంఘాలతో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read more

హర్యానా మాజీ సీఎం ఓం ప్రసాద్ చౌటాలా ఇక లేరు
హర్యానా మాజీ సీఎం ఓం ప్రసాద్ చౌటాలా ఇక లేరు

ఓం ప్రసాద్ చౌటాలా 89 సంవత్సరాల వయస్సులో మరణించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మరియు భారతీయ జాతీయ లోక్ దళ్ (INLD) నాయకుడు ఓం ప్రసాద్ చౌటాలా Read more

కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ
CID should investigate comprehensive family survey.. Shabbir Ali

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ Read more

ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్
imd warns heavy rains in ap and tamil nadu next four days

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో Read more

×