हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఏపీ బడ్జెట్‌.. రైతులకు ఏడాదికి రూ.20వేలు

sumalatha chinthakayala
ఏపీ బడ్జెట్‌.. రైతులకు ఏడాదికి రూ.20వేలు

రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలు మాఫీ

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయరంగానికి రూ.48,340 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన ఆయన ..గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను ఎంపిక చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 78 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ, రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను మాఫీ చేసిందన్నారు.

ఏపీ బడ్జెట్‌  రైతులకు ఏడాదికి

రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్ష

ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం రూ.6.300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులు రూ.11,314 కోట్లు, పోలవరం నిర్మాణం రూ.6,705 కోట్లు, భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.

పీఎం కిసాన్.. రూ. 6 వేలు

కాగా, ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతన్నలకు ఏటా రూ. 6వేలు జమ చేస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6వేలకు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870