CM Revanth Reddy meet the Prime Minister today

నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30కు ప్రధాని మోడీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ సమాచారం రావడంతో ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్‌రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మోడీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.

Advertisements
నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి

పెండింగ్‌ సమస్యలను ప్రధానికి విన్నపం

ఈరోజు భేటీలో ఈ ఘటనను పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు,పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లు తెలిసింది. మూసీ సుందరీకరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిసే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసీసీ పెద్దలతోనూ చర్చలు

ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం పెద్దలనూ కలిసి చర్చించేందుకు ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నారు. రెండో విడత కులగణన సర్వే ఈ నెల 28తో పూర్తి కానున్న నేపథ్యంలో తాజా వివరాలనూ క్రోడీకరించి నివేదికను అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించనుంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిపుణులతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. సీఎం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

Related Posts
Roads : రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనకాడొద్దు- సీఎం రేవంత్
cm revanth reddy 1735993001197 1735993006137

తెలంగాణలో రోడ్డు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. HRDCL (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) రోడ్డు ప్రాజెక్టులపై సమీక్ష Read more

ఆటో డ్రైవర్ల సంఘం నిరసన.
ఆటో డ్రైవర్ల సంఘం నిరసన.

ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆటో డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ లేదంటే ప్రభుత్వానికి తమ నిరసన సెగ తప్పదని Read more

హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం
Hyderabad second largest fl

హైదరాబాద్‌లో మరో ప్రధాన రహదారి విస్తరణకు నేడు నాంది పలికింది. ఆరాంఘర్-జూపార్క్ మధ్య నిర్మించిన రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా Read more

నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ntr cinema vajrotsavam

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు నందమూరి తారకరామారావు నటుడిగా అరంగేట్రం చేసిన మనదేశం సినిమాకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో సినీ Read more

×