हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ఏపీ డిప్యూటీ సీఎం ను కలిసిన కాంగ్రెస్ నేత వీహెచ్

Sudheer
ఏపీ డిప్యూటీ సీఎం ను కలిసిన కాంగ్రెస్ నేత వీహెచ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు (వీహెచ్) మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పేరు దామోదరం సంజీవయ్యగా మారుస్తూ నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ పవన్ కల్యాణ్‌ను కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఎంతో సేవలందించారని ఆయన గుర్తు చేశారు.

VH meets pawan

దామోదరం సంజీవయ్య సేవలకు గౌరవం

సామాజిక న్యాయం కోసం శ్రమించిన దామోదరం సంజీవయ్య రాష్ట్రంలో కార్మికులకు, పింఛనుదారులకు ప్రయోజనాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని వీహెచ్ పేర్కొన్నారు. ఆయన పేరుతో ఒక స్మారక భవనాన్ని నిర్మించి, ఆయన సేవలను గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిశీలించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

వీహెచ్‌కు పవన్ సత్కారం

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, వీహెచ్‌కు శాలువా కప్పి సత్కరించారు. వినాయక విగ్రహాన్ని బహూకరించారు. వీహెచ్ అందించిన విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించి పూర్తిగా చదివి, సంబంధిత అంశాలపై కార్యాచరణను పరిశీలిస్తానని తెలిపారు. రాజకీయ పరంగా విభేదాలు ఉన్నా, సమాజ సేవలో ఏకీభవించేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నేతలు ఈ భేటీలో వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870