కథానాయకుడు రామ్ తన తాజా చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RAPO 22’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇటీవలే రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ షూట్ మొదలైంది. అయితే శనివారం ఈ మూవీ లొకేషన్ కు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ వచ్చారు. రామ్ ని కలిసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
”తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న ‘RAPO 22’ షూటింగ్ కి విచ్చేసిన స్టార్ హీరో రామ్ పోతినేనిని, డైరెక్టర్ పి.మహేష్ బాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ”రామ్లోని ఎనర్జీ, డ్యాన్సులు నాకెంతో ఇష్టం. రబ్బరు స్ప్రింగ్ తరహాలో బాడీని డ్యాన్స్ మూమెంట్స్తో మౌల్డ్ చేస్తాడు. ఇప్పటి వరకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో, గోదావరి నది తీర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసిన సినిమాలు దాదాపుగా విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోనే విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించాను. గోదావరి జిల్లాలలో తీసే సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. ఈ సినిమా కూడా రామ్ కి మంచి విజయాన్ని అందజేస్తుంది అని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని కందుల దుర్గేష్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా రామ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసారు.
హీరో రామ్ తాజా చిత్రం గురించి
రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందుతుంది. భాగ్య శ్రీ బోర్సే నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ తరువాత రామ్ 22వ చిత్రం.
చిత్రీకరణ రాజమండ్రిలో ప్రారంభం
ఈ చిత్రం చిత్రీకరణ మొదలయ్యింది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ రామ్కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
మంత్రిపర్యటన – కందుల దుర్గేష్ రామ్తో చర్చ
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఈ చిత్రం సెట్ను సందర్శించారు. రామ్తో సమావేశమై ఆయన పలు ప్రశంసలు గుప్పించారు.
కందుల దుర్గేష్ మాట్లాడుతూ
“రామ్లోని ఎనర్జీ, డ్యాన్సులు నాకు ఇష్టం. ఆయన బాడీని డ్యాన్స్ మూమెంట్స్తో మౌల్డ్ చేయడం చక్కటి విషయం” అని కందుల దుర్గేష్ తెలిపారు.
గోదావరి నది తీర ప్రాంతాల్లో, పర్యాటక ప్రాంతాల్లో చిత్రీకరణ చేసిన సినిమాలు ఎక్కువగా విజయాన్ని సాధించాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.