హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సోనియాగాంధీ

డిశ్చార్జ్ అయిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను న్యూఢిల్లీలోని సర్ గాంగారమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీకి కడుపులో నొప్పి రావడంతో గురువారం ఉదయం 8.30 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారని పేర్కొన్నాయి. తమ నాయకురాలు ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

Advertisements

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైన ఆమె, పొత్తికడుపు సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతం నిలకడగా ఉందని గంగారామ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

sonia gandhi 262619452 16x9

గత డిసెంబరులోనూ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా కర్ణాటకలోని బెళగావిలో ‘నవ సత్యాగ్రహ బైఠక్’ పేరుతో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. అంతకు ముందు కూడా ఆమె పలుసార్లు అనారోగ్యంతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 78 ఏళ్లు కాగా గతంలో ఆమె కేన్సర్ బారినపడి కోలుకున్నారు.ఇక, 2016లో వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురై పడిపోయారు. దీంతో హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి ఆమెకు తరలించారు. అక్కడ నుంచి సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొద్ది రోజుల ఐసీయూలో చికిత్స తర్వాత కోలుకున్నారు.

రాజకీయ బాధ్యతల నుంచి విరమణ

గత ఏడాది, 78వ ఏట అడుగుపెట్టిన సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈసారిలోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయాల్లో మరింత క్రియాశీలంగా మారి, వయనాడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడిన వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకం నెలకొంది. ఆమె త్వరగా కోలుకోవాలని అనేక మంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.

Related Posts
ఆశారాంకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు
asaram bapu

ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 86 ఏళ్ల ఆశారాంకు Read more

Supreme court: అత్యాచారంపై అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద తీర్పు – సుప్రీం స్టే
వక్ఫ్ చట్టంపై సుప్రీంలో కొనసాగుతున్న వాడీ వేడి వాదనలు

అత్యాచార నేర పరిమితులపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనపై హైకోర్టు తీర్పులో వచ్చిన వ్యాఖ్యలు అమానవీయమైనవని Read more

MPs salaries hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం
The Center has increased the salaries of MPs

MPs salaries hike: దేశవ్యాప్యంగా ఎంపికైన ఎంపీల జీతాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇచ్చే లక్ష రూపాయల జీతాన్ని లక్షన్నరకు పెంచింది. జీతంతోపాటు Read more

MEA నివాస సముదాయంలో IFS అధికారి ఆత్మహత్య
IFS officer commits suicide

దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విదేశీ వ్యవహారాల శాఖ (MEA) నివాస సముదాయంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి జితేంద్ర రావత్ ఆత్మహత్య Read more

×