हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

నందిగం సురేశ్ కు ఊరట

Sudheer
నందిగం సురేశ్ కు ఊరట

2020లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2020లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనను పోలీసులు అరెస్టు చేయలేదు. తాజా పరిణామాల్లో, నందిగం సురేశ్ ఈ కేసులో కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

suresh

నందిగం సురేశ్‌పై ఇటీవలి కాలంలో పలు కేసులు

అమరావతి రాజధాని ఉద్యమ సమయంలో, అక్కడి మహిళలు నిరసనలు చేపట్టిన సమయంలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై 2020 ఫిబ్రవరిలో నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది. మహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది. కానీ, విచారణ సాగినా, పోలీసులు ఎలాంటి అరెస్టులు చేయలేదు. నందిగం సురేశ్‌పై ఇటీవలి కాలంలో పలు కేసులు నమోదవుతుండటంతో, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

మరియమ్మ హత్య కేసులో అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నందిగం సురేశ్‌పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మరియమ్మ హత్య కేసులో ఆయన అరెస్టయ్యారు. అయితే, కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, అమరావతి మహిళల కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, నందిగం సురేశ్ ఈ మధ్యాహ్నం కోర్టులో లొంగిపోయారు. ఆయన తరఫున న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, చివరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో నందిగం సురేశ్‌కు తాత్కాలికంగా ఊరట లభించినట్టయింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870