हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం

sumalatha chinthakayala
పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం

పేలుడుకు గల కారణాలేమిటో స్పష్టంగా తెలియరాలేదన అధికారులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు పేలుడు జరగడంతో 10 మంది మరణించారు. కార్మికులతో వెళ్తున్న పికప్ వాహనంపై పేలుడు పదార్థంతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది వెంటనే మరణించారు. 6 మంది గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఇంతకు ముందు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నైలో ఈ పేలుడు సంభవించింది.

రిమోట్‌తో పనిచేసే పరికరంతో పేలుడు జరిపినట్లు తెలుస్తోంద‌ని, ఏ గ్రూపు దాడికి పాల్ప‌డిందో తెలియాల్సి ఉంద‌ని ఓ అధికారి తెలిపారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ట్రక్కులో 17 మంది మైనింగ్ కార్మికులు ప్రయాణిస్తున్నారని ఏరియా డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వలీ అగా తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ఆస్పత్రికి చెందిన వైద్యుడు తెలిపారు. ఖనిజ సంపద కలిగిన ఓ ప్రాంతం బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా వేర్పాటువాద జాతి బలూచ్ గ్రూపుల తిరుగుబాటు ఉంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు కూడా చురుకుగా ఉన్నారు.

బలూచిస్థాన్‌లో ఇది మొదటి ఘటన కాదు. ఇటీవలి కాలంలో అక్కడ హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. ఈరోజు కూడా బన్నూలో సెక్యూరిటీ కాన్వాయ్ దగ్గర జరిగిన పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మంగళ్ మేళా ప్రాంతానికి సమీపంలోని డోమెల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు రోడ్డు పక్కన బాంబులు అమర్చి పేలుడు సంభ‌వించేలా చేశారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాదిని పట్టుకోలేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870