हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఖాతా తెరవనున్న కాంగ్రెస్

Sharanya
ఖాతా తెరవనున్న కాంగ్రెస్

ఢిల్లీని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంట్రీ తర్వాత అధికారానికి దూరమైంది. గత రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. ఈసారి కూడా పార్టీ అభ్యర్థులంతా వెనుకంజలోనే కొనసాగుతుండగా ఒక్క బాద్లీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా తెరిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాద్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు ‘‘ఫలితాలు నాకు తెలియదు, నేను ఇంకా ఫలితాలను చూడలేదు’’ అని ప్రియాంక అన్నారు.

Untitled

ఓట్ల లెక్కింపుకు ముందు, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీ మార్పును కోరుకుంటుందని, ఎన్నికల ఫలితాలతో ఈ మార్పు జరగబోతోందన్నారు. పదేళ్ల క్రితం ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.’’ అల్కా లాంబా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుహ్యంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, పార్టీ జాతీయ కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రచారం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సేవలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆమె కుమారుడిని బరిలో నిలిపినా ఉపయోగం లేకుండా పోయింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు.

ఒక స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యం
కొనసాగుతున్న ఈవీఎం ఓట్ల లెక్కింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870