భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితం లోని ఆసక్తికరమైన అనుభవాలను ఇటీవల పంచుకున్నారు ప్రముఖ ఆటగాళ్లైన సెహ్వాగ్, యువరాజ్, ద్రవిడ్ లతో కలిసి ఆయన గడిపిన ప్రయాణాన్ని ఈ సారి వివరించాడు.సెహ్వాగ్ గురించి చెప్తూ “అతను ఎప్పుడూ నా సూచనలకు విరుద్ధంగా ఆడేవాడు నేను అతనికి డిఫెన్సివ్గా ఆడమని చెప్పినప్పటికీ అతను ఆడటానికి ధాటిగా వెళ్లేవాడు. అప్పుడు నేను మెల్లిగా అతనికి వ్యతిరేకంగా చెప్పడం అలవాటుగా మార్చుకున్నాను” అని హాస్యంగా చెప్పాడు.ఇది చాలామంది క్రికెట్ అభిమానులను నవ్వించివేసింది. 2011 ప్రపంచ కప్ ముందు యువరాజ్ కొంత నీరసంగా కనిపించడంతో, సచిన్ అతనితో డిన్నర్కి వెళ్లి దాన్ని అడిగాడు.
యువరాజ్ చెప్పిన “పాజీ, నేను బంతిని సరిగ్గా టైమ్ చేయడం లేదు” అన్న మాటలకు సచిన్ స్పందించాడు. “నేను అతనికి బ్యాటింగ్ గురించి కాస్త దృష్టిని మార్చి ఫీల్డింగ్ పై దృష్టి పెట్టమని చెప్పాను. ఆ తరువాత అతనిలో మళ్లీ ఉత్సాహం పుట్టింది” అని సచిన్ చెప్తూ యువరాజ్ ను ప్రోత్సహించుకున్నట్లు చెప్పారు.సచిన్ తన జట్టులో ఉన్న అండగా ఉండటం ఒక్కో ఆటగాడు ఫామ్ లో లేకపోయినా జట్టు అండగా నిలబడాలి అని కూడా స్పష్టం చేశాడు.”మీరు మంచి ఫామ్లో ఉండవచ్చు, కానీ మరొకరికి అది ఉండకపోవచ్చు. కానీ జట్టుగా మీరు ఒకరికొకరు నమ్మకంతో ఉండాలి,” అని సచిన్ వెల్లడించాడు.న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో క్రిస్ కైర్న్స్ రివర్స్ స్వింగ్ ను ఎదుర్కొన్న అనుభవం గురించి సచిన్ చెప్పారు. “కైర్న్స్ బంతిని రివర్స్ స్వింగ్ చేస్తున్నప్పుడు, నేల కారణంగా బంతి మెరిసే వైపు కనిపించేది కాదు.
నేను రాహుల్ ద్రవిడ్తో కలిసి ఈ క్లిష్ట పరిస్థితిని పరిష్కరించాం” అని చెప్పాడు.ఈ ప్రసంగాన్ని సచిన్ రాష్ట్రపతి భవన్ లో ఇచ్చారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ఆటోగ్రాఫ్తో కూడిన భారత టెస్ట్ జెర్సీని అందజేశారు.సచిన్ తన కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సచిన్ టెండూల్కర్ 2014లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన (టెస్ట్లో 51, వన్డేల్లో 49) ఆటగాడు గా రికార్డులు సృష్టించాడు.తన అనుభవాలను పంచుకుంటూ జట్టు పని, నమ్మకం, బలమైన సంబంధాల ముఖ్యం గురించి కూడా సచిన్ చెప్పాడు.