అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామాపై స్పందించారు. పార్టీ మార్పుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడటం లేదని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాలలో నిజం లేదన్న ఆయన ఆ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు నమ్మవద్దని కోరారు.
ప్రతి పార్టీకి కొన్ని ఎత్తుపల్లాలు రాజకీయంగా సహజంగా ఉంటాయని అయోధ్య రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీలోనూ కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళతామని ఆయన తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని అయోధ్య రామిరెడ్డి ఖండించారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగేపార్టీ మనగలుగుతుందన్న ఆయన విజయసాయిరెడ్డి బెదిరింపులకు లొంగేవ్యక్తి కాదనితెలిపారు.
విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పారని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని.. ఓటమి చెందినప్పుడు తట్టుకుని నిలబడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి అన్నారు.