हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

యమునా నదిలో కేజ్రీవాల్‌ పోస్టర్!

Sukanya
యమునా నదిలో కేజ్రీవాల్‌ పోస్టర్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నది ఒక కీలక అంశంగా మారింది, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి చేసింది. శనివారం ఉదయం బీజేపీ న్యూ ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి పర్వేష్ వర్మ, యమునా నదిలో కేజ్రీవాల్ కటౌట్‌ పోస్టర్ను బోటు సహాయంతో ముంచారు. ఆ కటౌట్‌పై “మెయిన్ ఫెయిల్ హో గయా, ముఝే వోట్ మత్ దేనా, 2025 తక్ మెయిన్ యమునా సాఫ్ నై కర్ పాయా” (నేను విఫలమయ్యాను, నాకు ఓటు వేయవద్దు. 2025 నాటికి యమునాను శుభ్రం చేయలేకపోయాను) అన్న వాక్యాలతో కేజ్రీవాల్ సిగ్గుతో చెవులు పట్టుకున్నట్లు కనిపించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత పర్వేష్ వర్మ మాట్లాడుతూ, యమునాలోని నీటిని శుభ్రం చేయడం పెద్ద సవాలేమీ కాదు. సిల్ట్‌ను తొలగించడం, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడం, యమునా రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ గారు సబర్మతి రివర్‌ఫ్రంట్‌ను ఎలా అభివృద్ధి చేసారో అలాగే యమునాను కూడా శుభ్రపరుస్తారు అని వ్యాఖ్యానించారు.

యమునా నది కాలుష్యం ఢిల్లీ ప్రజలకు ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. గతంలో ఆప్ ప్రభుత్వం 2025 నాటికి యమునాను శుభ్రం చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు అని విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఎన్నికలలో ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. 70 అసెంబ్లీ స్థానాల కోసం మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870