గతేడాది ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా తన పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.వేలం సమయంలో పంజాబ్ కింగ్స్ తనను కొనుగోలు చేస్తుందేమోనని టెన్షన్ అనుభవించానని పంత్ చెప్పాడు.కానీ చివరకు లక్నో ఫ్రాంచైజీ అతడిని రూ.27 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. సోమవారం కోల్కతా లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, పంత్ను తమ జట్టు కెప్టెన్గా ప్రకటించారు.ఈ సందర్భంగా పంత్ గతంలోని వేలం నాటి అనుభవాలను మరల గుర్తుచేసుకున్నాడు.పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధిక పర్స్ ఉండటం వల్ల,వాళ్లు తనను కొనుగోలు చేస్తారేమోనన్న భయం తలెత్తిందని పంత్ తెలిపారు.కానీ పంజాబ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రేయాస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ తర్వాతే లక్నో ఫ్రాంచైజీ మరింత భారీ ధరతో పంత్ను తీసుకుంది”లక్నో ఫ్రాంచైజీ నా మీద అంత డబ్బు పెట్టింది కదా, మీపై ఒత్తిడి ఉందా?” అనే ప్రశ్నకు పంత్ చక్కటి సమాధానం ఇచ్చాడు. “గోయెంకా గారికి ఒత్తిడి లేకుంటే నాకు కూడా ఉండదు, అని సరదాగా చెప్పాడు.డబ్బు సంపాదించడంలో తప్పు ఏమీ లేదని, కానీ దా ని గురించి ఆలోచనతోనే నిత్యం మునిగిపోవడం సరైంది కాదని పంత్ అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పంత్పై విశ్వాసాన్ని చూపింది. ఇప్పుడు అతడు కెప్టెన్సీ బాధ్యతలతో జట్టును విజయాల బాట పట్టిస్తాడో లేదో చూడాల్సి ఉంది.ఐపీఎల్ అభిమానులు ఈ సీజన్ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.