हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

Divya Vani M
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అమరావతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల సమావేశం కీలకంగా మారింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు సాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాతో సుదీర్ఘ చర్చ జరిగింది.విజయవాడలో జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షాకు, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు లోకేశ్, అనిత, పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్మానం చేశారు.చంద్రబాబు నివాసంలో అమిత్ షాతో జరిగిన డిన్నర్ మీటింగ్ ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం సాయం, విభజన హామీల అమలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కేంద్రంపై కృతజ్ఞతలు తెలుపుతూ, పెండింగ్ ప్రాజెక్టులపై అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.సమావేశంలో ఎన్డీఏ నేతల మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఎన్టీఆర్‌కు భారతరత్నను ప్రస్తావించగా, చంద్రబాబు కూడా అమిత్ షాతో ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం 11,140 కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించిన విషయం ప్రత్యేక చర్చకు కారణమైంది. ఈ నిర్ణయంతో తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించామని అమిత్ షా వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఆర్థిక ప్యాకేజ్‌పై ట్వీట్ చేస్తూ ఏపీ అభివృద్ధిపై కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు ఈరోజు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ క్యాంప్ ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870