కరుణ్ నాయర్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వరుసగా సెంచరీలు సాధించి, తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని అందరికి చూపిస్తున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్లలో ఏడుసార్లు నాట్ అవుట్గా నిలిచి, ఒకసారి మాత్రమే అవుట్ కావడం అతని ప్రదర్శనకు చాటిచెప్పే అంశం. ప్రస్తుతం కరుణ్ చేసిన రికార్డులు, అతని భారత జట్టులోకి తిరిగి రావడం పై చర్చలకు దారి తీస్తున్నాయి.భారత క్రికెట్ జట్టులో స్థిరమైన ఆటగాళ్లు ఉన్నందున కరుణ్ నాయర్ యొక్క ఎంపికకు కొంత సవాల్ ఉంటుందని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.

క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “భారత వన్డే జట్టులో ప్రస్తుతం స్థిరమైన ఆటగాళ్లు ఉన్నారు, అందుకే మార్పులు తగ్గాయి. అయినప్పటికీ, నాయర్ యొక్క ప్రదర్శన ప్రశంసనీయం” అని అన్నాడు. అలాగే, నాయర్ జట్టులోకి ఎంపిక అయ్యే అవకాశం తక్కువగా ఉన్న, అతని ప్రదర్శన మాత్రం ఖచ్చితంగా చర్చలకు నాంది పలుకుతుంది.ఇంకా, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్కు యశస్వి జైస్వాల్ ఎంపిక కాకుండా విశ్రాంతి తీసుకోవడం సరికాదన్న అంశం పై దినేష్ కార్తిక్ స్పందించారు. “ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతనికి విశ్రాంతి అవసరం. 5 మ్యాచ్ల సిరీస్, టెస్టు క్రికెట్ ఆడడం అతనికి కష్టం అవుతుంది. సెలెక్టర్లు అతడిని విశ్రాంతి ఇవ్వడం ఉత్తమ నిర్ణయం” అని ఆయన చెప్పాడు.
జైస్వాల్ను ODI సిరీస్కు ఎంపిక చేయడం మాత్రం సరైన నిర్ణయమని కార్తీక్ అభిప్రాయపడ్డారు.2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్గా పరిణమిస్తుంది. 1998లో మొదలైన ఈ టోర్నమెంట్, 2017లో చివరిసారి నిర్వహించబడింది. ఈసారి పాకిస్తాన్, యూఏఈ జట్లతో కలిసి ఈ పోటీ నిర్వహించనున్నాయి. 2025 ఫిబ్రవరి 19 న ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.భారత జట్టులో ఇప్పటికే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును కచ్చితంగా ఎక్కువగా మార్పులు లేకుండా సిద్ధం చేస్తారు.