हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

Vanipushpa
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో సుమారు 50 రోజులకు పైగా ఉన్నారు. అనంతరం బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చంద్రబాబు తరుఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ స్కాం జరిగిందని.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ 2023లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా.. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది. స్కిల్ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ ఫైల్‌ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరుఫుు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870