हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

మైనర్‌ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు

Vanipushpa
మైనర్‌ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకునిపోతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఈ రంగం ఆ రంగం అని కాదు, దాదాపు అన్నిరంగాల్లో ఈ వేధింపులకు గురి అవుతున్నారు. కేరళ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లకాలంగా ఏకంగా 60 మంది తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మైనర్‌ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
18 ఏళ్ల ఆ క్రీడాకారిణి తాను మైనర్‌గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ సమాఖ్య నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్‌లో క్రీడాకారిణి తనకు జరిగిన దారుణాల గురించి వివరించింది. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత కోచ్‌లు, క్లాస్​మేట్స్, అథ్లెట్స్​ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడించింది.

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు 62 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలిని కౌన్సిలింగ్‌కు పంపించినట్లు పథనంథిట్ట ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870