हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

పెను విషాదం : తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..

Sudheer
పెను విషాదం : తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. పద్మావతి పార్క్ వద్ద భక్తులు టోకెన్ల కోసం వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన భక్తుల ఆందోళనను మరింత పెంచింది. ఒక మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు గేటు తెరిచారు. అయితే, టోకెన్లు ఇచ్చేందుకు గేటు తెరిచారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. క్యూలైన్ వద్ద భక్తుల ఒత్తిడి పెరగడంతో ఈ దుర్ఘటనకు దారితీసింది.

ఈ ఘటనకు సిబ్బంది తీరే కారణమని భక్తులు మండిపడుతున్నారు. క్యూలైన్ వద్ద సిబ్బంది చేసిన ఓవరాక్షన్ వల్ల భక్తులు మరింత ఆందోళనకు గురై ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. భక్తుల నిర్వహణలో జరిగిన లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భక్తుల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి వస్తున్న సమయంలో క్యూలైన్లలో శాంతంగా ఉండాలని, సిబ్బంది సూచనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు భక్తుల నుండి సహకారం అవసరమని అధికారులు చెప్పారు. భక్తుల భద్రతే తమ ప్రాధాన్యత అని తి.తి.దే స్పష్టం చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870