south korea president

దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్

దక్షిణ కొరియాలో రాజకీయ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ కొరియా దర్యాప్తు సంస్థ అధికారులు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఓ పక్క ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే యూన్ సుక్ యోల్ అభిశంసన ఎదుర్కొంటుండగా, మరో పక్క యూన్‌‌‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం అందుకు అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
త్వరలోనే అరెస్టు?
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, అనుకూలంగా 204 మంది ఓటు వేయగా, 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష బాధ్యతలను, విధులను ప్రధాన మంత్రి హన్ డక్ సూకి అప్పగించాల్సి ఉంటుంది అయితే యూన్‌ను తప్పించాలా ? కొనసాగించాలా ? అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లో తేల్చనుంది. కాగా, యూన్ సైతం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు పేర్కొంటున్నారు.
సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు. త్వరలోనే అయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

president

విచారణకు గైర్హాజరు

యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు జరుగుతోంది. న్యాయవాదులతో పాటు పోలీస్, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. ఈ క్రమంలో మూడు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టు వారెంట్ కోరుతూ దర్యాప్తు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Related Posts
టారిఫ్స్‌తో మూడు దేశాల్ని టార్గెట్ చేసిన ట్రంప్
మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. కెనడా, మెక్సికోపై 25%, చైనాపై 10% కొత్త టారిఫ్స్ విధించాలని నిర్ణయించారు. ఈ దేశాల దిగుమతులపై Read more

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా నుండి గౌరవం
nigeria

నైజీరియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా (GCON) అవార్డుతో సత్కరించనున్నది. ఈ గౌరవం, 1969లో క్వీన్ ఎలిజబెత్ Read more

శ్రీలంకలో 2024 పార్లమెంటరీ ఎన్నికలు
Sri Lanka Parliament GettyImages 1228119638

శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలు నవంబర్ 14, గురువారం న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, న్యాయమైన, పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామని Read more

సింగ‌పూర్ లో తెలంగాణ కల్చ‌ర‌ల్ మీట్ లో సీఎం రేవంత్
CM Revanth at Telangana Cul

సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్ Read more