हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

జీవాంజి దీప్తిని అభినందించిన చిరంజీవి

Sudheer
జీవాంజి దీప్తిని అభినందించిన చిరంజీవి

పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తి ప్రతిభకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లో గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో దీప్తిని సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి, దీప్తి సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ, దీప్తి కష్టపడే మనస్తత్వం, పట్టుదల వల్లే ఈ ఘనత సాధ్యమైందని కొనియాడారు. ఆమె విజయంతో దేశానికి గర్వకారణమని, మరెంతో మంది యువతకు స్పూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు. దీప్తి పుట్టిన ఊరు వరంగల్ జిల్లా పర్యతగిరి మండలం కల్లెడ గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నతనంలోనే మానసిక వైకల్యం, మేథోపరమైన సమస్యలను ఎదుర్కొంది. కానీ, క్రీడల పట్ల ఆమె మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. ప్రత్యేకంగా దీప్తి తండ్రి యాదగిరి తనకు ఉన్న ఒక ఎకరం పొలాన్ని విక్రయించి, కుమార్తె కోసం అడ్డంకులు తొలగించారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, క్రీడలపై ఆమె అంకితభావం జీవాంజీ దీప్తిని మేటి క్రీడాకారిణిగా మలిచాయి. ఆ క్రమంలో పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకొని, రాష్ట్రానికి, దేశానికి గౌరవం తెచ్చింది. ఈ ఘనత ఆమె కష్టానికి, తల్లిదండ్రుల త్యాగానికి దక్కిన ఫలితమని పలువురు అభిప్రాయపడ్డారు.

జీవాంజీ దీప్తి విజయంతో రాష్ట్ర యువతకు ఒక ప్రేరణగా నిలిచింది. జీవితంలో ఎంతటి సవాళ్లైనా ఓర్పుతో, పట్టుదలతో ఎదుర్కొంటే విజయాలు సాధ్యమేనని ఆమె నిరూపించింది. ఈ ఘనతకు కారణమైన క్రీడాకారిణిని ప్రశంసించిన చిరంజీవి, యువత ఇలాంటి విజయాలు సాధించేందుకు క్రీడలను మరింత ప్రోత్సహించాలని కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870