हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఎంపీడీవోను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

Vanipushpa
ఎంపీడీవోను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శనివారం పరామర్శించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఈ సంఘటన తెలిసిందే. విజయవాడ నుంచి నేరుగా కడప జిల్లాకు వెళ్లి రిమ్స్‌లో ఉన్న ఎంపీడీవోను పరామర్శించి ధైర్యం చెప్పారు.
వైసీపీకి కొత్తమీ కాదు
ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించం. ఇంకా వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌, తోలు తీసి కూర్చోపెడతామని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీవోను అమానుషంగా కొట్టారని తెలిపారు. అధికారులపై దాడిచేయడం వైసీపీకి కొత్తమీ కాదని ఆరోపించారు. దాడులకు దిగి భయపెట్టాలని చూస్తే గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

ఘటనాస్థలికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదని, వైసీపీ నాయకులకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని ఆరోపించారు. వైసీపీ దౌర్జన్యాలను ఎలానియంత్రిచాలో తెలుసు.. చేసి చూపిస్తామని అన్నారు. దాడి చేసిన వారిని ఎవరూ రక్షించలేరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870