हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి

sumalatha chinthakayala
మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి అని ఆయన అభివర్ణించారు. మన్మోహన్‌ సింగ్‌ మరణం దేశానికి తీరనిలోటు మాత్రమే కాదని, వ్యక్తగతంగా తనకు కూడా లోటేనని అన్నారు. ఆయన తనకు చాలాకాలంగా తెలుసని, పొలైట్‌నెస్‌కు ఆయన గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఆయన భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పిగా తాను భావిస్తానని, తాను ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ కూడా మన్మోహన్‌కు నివాళులర్పించారు.

కాగా, గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలువురు నేతలు మన్మోహన్‌కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870