हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Sudheer
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ వాసులు అతి త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నారు. మెట్రో ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారనున్నట్లు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం 3 కోచ్లతో నడుస్తున్న మెట్రో ట్రైన్లను 6 కోచ్లుగా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే మెట్రోలో రోజువారీ ప్రయాణికుల రద్దీ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

“ప్రస్తుతం ఉన్న ట్రైన్లను 3 నుంచి 6 కోచ్లకు పెంచడంపై అధ్యయనం జరుగుతోంది. అయితే, 8 కోచ్ల ట్రైన్లను నడపడానికి ఈ మెట్రో డిజైన్ అనుకూలం కాదు” అని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణంలో అనేక ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాల్లా కాకుండా, హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతను మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మితమైంది. ఇదే దీని ప్రత్యేకత అని ఆయన చెప్పారు. ప్రయాణికుల అనుభవాలను మెరుగుపరిచే దిశగా మెట్రో సాంకేతికతను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు 6 కోచ్ల విస్తరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమలుకు అవసరమైన ప్రణాళికలు త్వరలో సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల నుంచి అనుకూల స్పందనను తెచ్చుకోవచ్చని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870