हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

విజయ్ చౌక్ ఇండియా కూటమి ఎంపీల నిరసన

Sudheer
విజయ్ చౌక్ ఇండియా కూటమి ఎంపీల నిరసన

శీతాకాల సమావేశాల చివరి రోజున కూడా పార్లమెంటు వేదికపై ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇండియా కూటమి ఎంపీలు విజయ్ చౌక్ వద్ద నిరసనకు దిగారు. అంబేడ్కర్ పై అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో ఎంపీలు “అంబేడ్కర్‌కు గౌరవం – అసత్యాలకు చెంపదెబ్బ” అంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసనలకు అనుమతి నిరాకరించడంతో, విజయ్ చౌక్‌కు తరలిపోవడం గమనార్హం. ఇందుకు కారణం పార్లమెంట్ భవనం సమీపంలో నిరసనలకు స్పీకర్ ఓంబిర్లా నిషేధం విధించడం. సభలు సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ, విపక్ష సభ్యుల నిరసనల కారణంగా అది సాధ్యపడలేదు. మంత్రుల వ్యాఖ్యలు, వాటిపై కూటమి ఎంపీల ప్రతిస్పందనలతో పార్లమెంటు వేదిక పలు సందర్భాల్లో ఉద్రిక్తంగా మారింది. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యల పేరుతో ఈ నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.

ఇండియా కూటమి ఎంపీలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, దేశంలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి గౌరవం కల్పించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలు పదవిలో ఉండటం తగదని వారు స్పష్టం చేశారు. దీనికి తోడు, సభా కార్యకలాపాలు ప్రతిస్పందనల మధ్య తాత్కాలికంగా నిలిచిపోయాయి. పార్లమెంటు చివరి రోజున కూడా సమైక్యతను కాపాడడంలో విఫలమవ్వడం బాధాకరమని, ప్రభుత్వ నాయుకత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని విపక్షాలు అభిప్రాయపడ్డాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870