हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్..కారణం అదే

Sudheer
ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్..కారణం అదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. తొలి రోజే రూ.280 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం, అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని థియేటర్లపై అధికారుల చర్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో థియేటర్లు సీజ్ చేయడం, అభిమానుల్లో ఆగ్రహం రేపుతోంది.

కుప్పంలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న లక్ష్మీ, మహాలక్ష్మీ థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టించింది. టీడీపీ సీనియర్ నేతకు చెందిన ఈ థియేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, థియేటర్ల యాజమాన్యం లైసెన్సు రెన్యూవల్ చేయకపోవడం, ఎన్‌ఓసీ లేకుండా ప్రదర్శనలు కొనసాగించడం కారణంగానే చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయానికి హాని కలిగించే థియేటర్లను ఉపేక్షించబోమని, అన్ని అనుమతులు తీసుకుని మాత్రమే థియేటర్లు నడుపాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న తనిఖీలలో పర్మిషన్ల లేమి ఉన్న థియేటర్లపై చర్యలు తీసుకోవడం కొత్త కాదు. కానీ, విజయవంతమైన చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని థియేటర్లను సీజ్ చేయడం అన్యాయమని అభిమానులు ఆరోపిస్తున్నారు. పుష్ప 2 ప్రదర్శనకు ఆటంకం కలిగించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870