हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

భారతదేశంలో అత్యంత యువ పైలెట్‌గా సమైరా హుల్లూర్..

pragathi doma
భారతదేశంలో అత్యంత యువ పైలెట్‌గా సమైరా హుల్లూర్..

18 ఏళ్ల సమైరా హుల్లూర్, కర్ణాటక రాష్ట్రం నుండి భారతదేశంలో అత్యంత యువ వాణిజ్య పైలెట్‌గా గుర్తింపు పొందింది. ఆమె 18 ఏళ్ల వయస్సులోనే కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ను పొందడం అందరికీ ఒక ఆదర్శంగా మారింది. సమైరా తన లక్ష్యాన్ని సాధించడంలో ఎంతో కష్టపడి, ఎంతో సాధనతో అందుకుంది.

సమైరా హుల్లూర్ తండ్రి అమీన్ హుల్లూర్, ఒక ఇంటీరియర్ డిజైనర్, తన కుమార్తెకు ఎప్పుడూ మద్దతు అందించారు.సమైరా మొదట శిక్షణ తీసుకున్నది న్యూఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో (VYAA).అక్కడ శిక్షణ పూర్తి చేసిన తరువాత, మరింత నైపుణ్యం సంపాదించేందుకు ఆమె మహారాష్ట్రలోని బారామతిలోని కార్వర్ ఏవియేషన్ అకాడమీలో చేరింది.

ఆమె రెండు సంవత్సరాల కాలంలో 200 గంటల పైగా విమాన ప్రయాణ అనుభవాన్ని పొందింది. ఆరు పరీక్షలను క్లియర్ చేసి, కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌ పొందింది.ఈ ఘనత సాధించడంలో కెప్టెన్ తపేష్ కుమార్ మరియు వినోద్ యాదవ్ గారి శిక్షణ, మార్గదర్శకత్వం సమైరా కోసం ఎంతో విలువైనవిగా మారాయి.

సమైరా చెబుతూ, “నేను ఎప్పుడూ పైలెట్ కావాలని కలలు కనేదాన్ని.నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. కెప్టెన్ కుమార్‌ నాకు స్ఫూర్తినిచ్చారు. ఆయన 25 ఏళ్ల వయస్సులో లైసెన్స్ పొందారు.ఆయన చూపిన మార్గంలోనే నేను నా లక్ష్యాన్ని చేరుకోగలిగాను అని చెప్పారు.ఈ విజయంతో సమైరా దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తినిచ్చింది. ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు కఠిన శిక్షణతో, ఆమె కలలను నిజం చేసుకుంది. .

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870