हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే

Divya Vani M
కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మెయిన్ లీడ్‌లో నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రాబోయే ఏడాది జనవరి 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఆమె తెలిపింది. ఈ ప్రకటనకు తోడు, ఎమర్జెన్సీ కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేస్తూ, “ఇది భారతదేశ అత్యంత శక్తివంతమైన మహిళ కథ.

దేశపు దిశను మార్చిన సంఘటనలు మీ ముందుకు రాబోతున్నాయి” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది.1975లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఆ కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కంగనా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సహకారంతో నిర్మించిన ఈ చిత్రం, తొలుత నిశ్చయించిన తేదీకి విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డుతో సమస్యలు ఎదురవ్వడంతో ఆలస్యం జరిగింది.ఈ చిత్రంపై పంజాబ్‌కు చెందిన కొన్ని సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.

ఈ వివాదాల కారణంగా సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం జరిగింది.అయితే, తాజా పరిణామాల్లో సెన్సార్ బోర్డు సినిమాను మరోసారి సమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. ఆ మార్పుల తర్వాతే చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమర్జెన్సీ చిత్రానికి అంతటా గ్రీన్ సిగ్నల్ లభించడంతో విడుదల తేదీని ఖరారు చేశారు.ఈ చిత్రాన్ని తన జీవితంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న ప్రాజెక్ట్‌గా కంగనా అభివర్ణించారు. ఇందిరా గాంధీ పాత్రను పోషించడమేకాక, ఆ పాత్రకు తగ్గ పరిణతితో కథనాన్ని రూపొందించడం తనకు చాలా ప్రత్యేక అనుభవమని తెలిపారు.జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కంగనాకు ఎంతటి విజయాన్ని తీసుకురావాలని ఆశించాలి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870