हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌

sumalatha chinthakayala
ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌

ముంబయి : మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పవార్‌ వర్గంలో.. మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కుమారుడు జీషన్‌ సిద్ధిక్‌ చేరారు. కాంగ్రెస్‌లో టికెట్ పొందకపోవడం కారణంగా ఆయన అజిత్‌ పవార్‌ వర్గానికి చేరినట్లు సమాచారం. ఎన్సీపీ బాంద్రా ఈస్ట్‌ నుంచి జీషన్‌ను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు తెలిపింది. మునుపు, జీషన్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై వాండ్రే ఈస్ట్‌ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు, కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన కారణంగా పార్టీ బహిష్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో ఎన్సీపీ పవార్‌ వర్గంలో చేరడం ఆయనకు ప్రాధాన్యతను అందించింది.

ఈ సందర్భంగా జీషన్‌ మాట్లాడుతూ.. “నాకు, నా కుటుంబానికి ఇది చాలా ముఖ్యమైన రోజు. మాకు కష్టసమయంలో ధైర్యం చెప్పిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాంద్రా ప్రజల ప్రేమ, మద్దతుతో మళ్లీ విజయం సాధిస్తాను” అని వెల్లడించారు.

కాగ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, ఎన్సీపీ పవార్‌ వర్గం అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో బాబా సిద్ధిక్‌ కుమారుడు జీషన్‌కు బాంద్రా స్థానం నుంచి టికెట్‌ కేటాయించడం గుర్తింపు పొందింది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌ తన కుటుంబానికి ప్రాముఖ్యత ఉన్న బారామతి స్థానం నుంచి పోటీలో ఉంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు ప్రకటించింది, మరియు నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని నెలకొల్పుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870