CM Chandrababu restarted AP capital works

ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. తుళ్లూరు మండలం.. రాయపూడి దగ్గర రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. అక్కడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) భవనానికి పూజలు చేశారు. ఆ తర్వాత భవనంలో కలియ తిరిగారు. అక్కడి అధికారులను రాజధాని నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ఉన్నారు.

CRDA ఆఫీసు పనుల ద్వారా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనట్లైంది. ఇక ఈరోజు నుంచి రాజధాని నిర్మాణం సాగుతుంది. CRDA భవనాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ నిధులు కేటాయించారు. ఏడు అంతస్థుల ఈ భవనంలో ఇదివరకు రాజధాని పనులు సాగేవి. 2017 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఐతే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ భవనంలో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇందులో కొన్ని మరమ్మతుల వంటివి చేపట్టాల్సి ఉంది. అలాగే సరికొత్త మార్పులు చెయ్యాల్సి ఉంది. అవి పూర్తయ్యాక.. రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాల పనులు మొదలవుతాయి.

సీఆర్డీయే ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లు కేటాయించారు. సీఆర్డీయే, ఏడీసీ, మున్సిపల్ శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇక వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టేలా ప్లాన్ ఉంది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబంధించిన పనులు 2025 జనవరి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

Related Posts
ప్రయివేట్ భూముల తొలగింపు
ప్రయివేట్ భూముల తొలగింపు

ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & Read more

Handloom Workers : చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ. 50,000 సాయం
Handloom Workers2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల కోసం వారి ఇంటి నిర్మాణానికి Read more

రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన రేషన్‌కార్డు దరఖాస్తుల స్వీకరణ
Receipt of ration card application resume in the state

‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ హైదరాబాద్‌: రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన రేషన్‌కార్డు దరఖాస్తుల స్వీకరణ. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడంపై క్లారిటీ వచ్చేసింది. మీ-సేవ Read more

ఐదేళ్లలో తెలంగాణలో ఎంతమంది మిస్ అయ్యారో తెలుసా..?
missing telangana

తెలంగాణ లో గత ఐదేళ్లలో లక్ష మందికి పైగా అదృశ్యమవ్వడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఈ మొత్తం అదృశ్యాల్లో 60 వేల మందికి పైగా ప్రేమికులే ఉన్నారని Read more