తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది – తాటికొండ రాజయ్య

రేవంత్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు.రేవంత్ రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని ఒకసారి అంటారని, హైదరాబాద్‌‌కు మూడు వైపులా సముద్రం ఉంటుందని మరోసారి అంటారని ఎద్దేవా చేశారు.

ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారా? తెలివి లేక మాట్లాడుతున్నారా? అని విమర్శించారు. పాలనపై పట్టులేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *