7.1 magnitude earthquake hits Nepal

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం రాగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు పొరుగున ఉన్న బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతం లోబుచేకి ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 6:35 గంటలకు భూమి కంపించింది.

Advertisements
image
image

టిబెట్‌లోని షిగాట్సే నగరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. భూకంప తీవ్రత నేపాల్ లో అధికంగా ఉంది. గతంలో అక్కడ భారీ భూకంపాలు సంభవించాయని తెలిసిందే. 2015లో నేపాల్ రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఆ సమయంలో దాదాపు 9,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 22,309 మంది గాయపడ్డారు.

నేపాల్ రాజధాని ఖాట్మండుకు చెందిన ఓ వ్యక్తి భూంకంపై స్పందించారు. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలిపారుు. “భూకంపం వచ్చినప్పుడు మేం నిద్రపోతున్నాను, కానీ మేం నిద్రిస్తున్న మంచం కదులుతోంది. మా బాబు మంచం కదిలిస్తున్నాడని మొదట అనుకున్నాను. కానీ కిటీకీలు కూడా కదలడం చూసి భయం వేసింది. ఇది భూకంపం అని నిర్ధారించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. మా అబ్బాయికి ఫోన్ చేయడంతో అతడు కూడా క్షణాల్లో బయటకు వచ్చాడని తెలిపారు.

Related Posts
అమెరికా ఐరోపా నుంచి కూడా రన్యారావు బంగారం స్మగ్లింగ్
అమెరికా ఐరోపా నుంచి కూడా రన్యారావు బంగారం స్మగ్లింగ్

దుబాయ్ నుంచి అక్రమ బంగారం స్మగ్లింగ్ కేసు: కన్నడ నటి రన్యా రావు అరెస్టు ప్రముఖ కన్నడ నటి రన్యా రావు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. Read more

Disha Patani’s sister : పసికందును కాపాడిన దిశా పటానీ సోదరి
disha sister

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో ఓ మానవతా ఘటన వెలుగుచూసింది. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ గొప్ప ధైర్యసాహసం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. Read more

రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ
President's refusal to meet with farmers' association

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, Read more

అయోధ్య ఆలయ ప్రధానపూజారి కన్నుమూత
Chief priests of Ayodhya temple passed away

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ కన్నుమూశారు సత్యేంద్ర దాస్ కు చిన్నప్పటి నుంచి రామ్ పై అపారమైన ప్రేమ. అయోధ్య రామాలయ ప్రధాన Read more

Advertisements
×