కేటీఆర్ తాజాగా నెటిజన్లతో #AskKTR సెషన్ లో పలు కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా కేసీఆర్ ఆరోగ్యం, రాజకీయ కార్యకలాపాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేటీఆర్ తన తండ్రి, సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు, “కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రతి రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు,” అని తెలిపారు. ఆయన 2025 నుండి ప్రజాక్షేత్రంలోకి రానున్నారని, అయితే పరిస్థితులు అనుకూలిస్తే ముందుగానే ప్రజల్లోకి వస్తారని చెప్పారు.
రెవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రశ్నలు వచ్చినందున, సమకాలీన రాజకీయ అంశాలపై కేటీఆర్ చర్చించనున్నారు. ఈ #AskKTR సెషన్ ద్వారా నెటిజన్లతో మళ్లీ చిట్చాట్ చేయడానికి కేటీఆర్ సాయంత్రం 6 గంటలకు అందుబాటులోకి రానున్నారు.