వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం

ఆలయ హుండీలో 2000 నోట్లు చలామణి

దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణి 2023లో రద్దైన విషయం అందరికీ తెలుసు. అయితే, ఆ నోట్లు ఇప్పుడు బయటపడటమే కాదు, ఓ ఆలయ హుండీలో కనిపించడం సంచలనం సృష్టించింది. రద్దయిన నోట్లను ఇంట్లో ఉంచుకోవడం వలన ప్రయోజనం లేదని, స్వామి వారికి హుండీ కానుకగా ఇస్తే పుణ్యం వస్తుందని ఆలోచించిన ఓ భక్తుడు, రూ.2 వేల నోట్లను స్వామి వారికి సమర్పించినట్లున్నాడు.గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు జరుపుతుండగా, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ రద్దయిన రూ.2 వేల నోట్లు బయటపడ్డాయి.

వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం
వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం

మొత్తం 122 నోట్లు (రూ.2.44 లక్షలు) హుండీ నుంచి రావడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.చెల్లుబాటు కాని నోట్లను ఎవరో స్వామి వారికి కానుకగా సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆలయ భక్తుల మధ్య ఆసక్తికర చర్చలకు దారితీసింది.అయితే, ఈ కానుకల వెనుక ఉద్దేశం ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. ఆ భక్తుడు ఆ నోట్లను ఎందుకు సమర్పించాడో, అతను ఎవరనేది కూడా తెలియరాలేదు. ఇది భక్తుడి అమాయకత్వమా లేక విశ్వాసమా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.ఇలాంటి సంఘటనలు ఆలయ హుండీల్లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే, ఈ ఘటన ఆలయ సిబ్బందిని, భక్తులను ఒకింత ఆలోచనలో పడేసింది. రద్దయిన నోట్లతో స్వామివారి సేవను చేసుకోవాలనుకున్న ఆ భక్తుడి విశ్వాసం కొందరిని ఆశ్చర్యపరచగా, మరికొందరిని నవ్వించేలా చేసింది.ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ సంఘటన ఆలయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుందని మాత్రం చెప్పవచ్చు.

Related Posts
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
Terrorist attack on army vehicle

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం Read more

విమాన ప్రయాణం అంటే వణికిపోతున్న ప్రయాణికులు
flight threat

నెల రోజుల క్రితం వరకు విమాన ప్రయాణం అంటే తెగ సంబరపడి ప్రయాణికులు..ఇప్పుడు విమాన ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. Read more

ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీని ప్రారంభించిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
IDFC First Bank launched IDFC First Academy

భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి వేసిన ముందడుగు.. హైదరాబాద్ : డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్న సమగ్ర ఆర్థిక అక్షరాస్యతకార్యక్రమం అయిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీనిప్రారంభించినట్లు Read more

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ ముందుకు వచ్చిన ‘టాటా’
tata

భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *