20 thousand to farmers under Annadata scheme.. Atchannaidu

అన్నదాత పథకం క్రింద రైతుకు 20 వేలు : అచ్చెన్నాయుడు

అమరావతి: మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకం క్రింద, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం అని శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం అన్నారు ఆయన. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి ఈ నగదు జమ చేస్తాం అని తెలిపారు. ఏపీ వెబ్ ల్యాండ్ ప్రకారం 43 లక్షల మందికి పీఎం కిసాన్ వస్తోంది. వీరితో పాటు 9-10 లక్షల మంది రైతులకు మే నెలలో ఈ డబ్బు జమ చేస్తామన్నారు.

Advertisements
అన్నదాత పథకం క్రింద రైతుకు

తాము రైతులకు అన్ని విధాలుగా అండగా

బడ్జెట్లో రూ.6300 కోట్లు కేటాయించాం అని ప్రకటించారు. అలాగే కౌలు రైతులకు ఎలా సాయం ఇవ్వాలో ఆలోచన చేస్తున్నాం అని పేర్కొన మంత్రి అచ్చెన్నాయుడు.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారికి అండగా ఉంటాం అని అన్నారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని… కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. భూసార పరీక్షలు లేవు, వ్యవసాయ యంత్రాలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని దుయ్యబట్టారు. తాము రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.

కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక

మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’లో భారీ అవినీతి జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 18, 19, 20 తేదీల్లో శాసనసభ్యుల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నట్లు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు తెలిపారు.

Related Posts
శ్రీశైలంలోని దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వక్ఫ్ చట్టంపై సుప్రీంలో కొనసాగుతున్న వాడీ వేడి వాదనలు

2015లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే Read more

బైడెన్‌ నిర్ణయం: ట్రంప్ అధికారంలోకి రాకముందు ఉక్రెయిన్‌కు కీలక మద్దతు
biden zelensky

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది ఉక్రెయిన్‌కు మిత్ర దేశం నుండి మరింత మద్దతును అందించడానికి Read more

ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై CM కీలక ప్రకటన
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61కి పెంచిన గత ప్రభుత్వ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశ్యం వారి బకాయిలను ఎగ్గొట్టడమేనని ముఖ్యమంత్రి రేవంత్ Read more

బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu review of budget proposals

ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు పై చర్చ అమరావతి: ఈనెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర Read more

×