Fishermen ap 20 k

Fishermen : ఏపీలో మత్సకారుల ఖాతాల్లో 20 వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్సకారులకు వేసవిలో ఆర్థిక భారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రూ.20 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపల వేటపై వేసవిలో అమలవుతున్న నిషేధం నేపథ్యంలో మత్సకారులు ఉపాధి కోల్పోతారు కాబట్టి, వారిని ఆదుకునేందుకు ప్రతి ఏడాదిలా ఈసారి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది.

Advertisements

అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం

తూర్పు తీర ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం ప్రారంభమైంది. ఇది 61 రోజులు అంటే జూన్ 15 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో మత్సకారులు మరబోట్లు, ఇంజిన్ బోట్లతో సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ నిషేధ సమయంలో ఉపాధి లేకుండా పోయే మత్సకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించనుంది.

Fishermen ap
Fishermen ap

ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ

ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఒక మత్సకార గ్రామాన్ని సందర్శించి వారికి ఈ పరిహారాన్ని అందించనున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నిర్ణయం మత్సకార కుటుంబాలకు కొంత ఊరటను తీసుకొస్తుందని అంచనా. అలాగే, ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.

Related Posts
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించిన యాజమాన్యం
vizag steel plant employees

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రమే Read more

గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
gaganyan2

శ్రీహరికోట (తడ), డిసెంబర్ 10 ప్రభాతవార్త భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు Read more

PM Modi : ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
Sri Lanka highest award for Prime Minister Modi

PM Modi : భారతదేశం, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ఉమ్మడి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శ్రీలంక Read more

అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి తింటే కలిగే లాభాలు
health benefits of anjeer f

ఆరోగ్య నిపుణులు ప్రకారం, అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తినడం శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. ఈ పండ్లను తేనెతో కలిపి పరగడుపున తింటే Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×