10,000 suggestions received from people on budget.. CM Rekha Gupta

Delhi budget : బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల సూచనలు అందాయి: సీఎం రేఖాగుప్తా

Delhi budget : ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేఖాగుప్తా పేర్కొన్నారు. అయితే త్వరలో ప్రవేశపెట్టనున్న వికసిత్‌ ఢిల్లీ బడ్జెట్‌ విషయంలో ప్రజల నుంచి 10 వేల సూచనలు అందినట్లు రేఖాగుప్తా వెల్లడించారు. ఇందులో మహిళల ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, యమునా నది ప్రక్షాళన, కాలుష్యం వంటివాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దేశరాజధానిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisements
బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల

మెయిల్ ద్వారా 3,303 సూచనలు

బడ్జెట్‌ను సిద్ధం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం నిపుణులతో సహా సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించిందని రేఖా గుప్త తెలిపారు. ప్రజల నుంచి మెయిల్ ద్వారా 3,303 సూచనలు రాగా.. వాట్సప్ ద్వారా 6,982 సూచనలు వచ్చినట్లు వెల్లడించారు. వాటిని పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందిస్తామని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిల్లీని అభివృద్ధి బాటలో నడుపుతుందని పేర్కొన్నారు.

Related Posts
కర్ణాటక రోడ్డు ప్రమాదం పై పవన్ స్పందన
Pawan's response to the Kar

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం షాక్‌కు గురిచేసింది. మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. రఘునందన Read more

కుంభ మేళలో అదాని అన్నదానం
adani food

ఈ నెల 13వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆరంభమైన మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను Read more

“పరీక్షా పే చర్చ” ఈసారి ప్రధానితో పాటు సెలబ్రిటీలు..
Pariksha Pe charcha This time celebrities along with Prime Minister

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న "పరీక్షా పే చర్చ" ఈ ఏడాది కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. అయితే మోడీతో Read more

రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు నివేదిక
రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు నివేదిక

వక్ఫ్‌ సవరణ బిల్లు-2024'పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికను జేపీసీ చైర్మన్‌గా వ్యవహరించిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×