సమాజ్వాదీ పార్టీ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ప్రయాగ్రాజ్లోని కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరం అని పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. ఇందులో చాలా మంది మరణించారు మరియి గయా పడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కనీసం ఒక్క కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని కోరారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను శివపాల్ యాదవ్ విమర్శించారు. మహా కుంభ మేళ కోసం గత ఆరు నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది అని అంతర్జాతీయ స్థాయిలో తాము దీని కోసం సిద్ధమవుతున్నామని వారు చెప్తున్నారు, కానీ వారు అలా చేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది అని అన్నారు. కుంభ మేళ తొక్కిసలాటలో గాయపడిన వారికీ ఉన్నత స్థాయి చికిత్స అందించాలి అని మరియు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన అన్నారు.

ఈ ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని నిర్లక్ష్యం జరిగింది అని అన్నారు. ఈ పరిస్థికి కారణాలను వెల్లడించాలి, దర్యాప్తు నిర్వహించాలి అని సమాజ్వాదీ పార్టీ నాయకుడు తెలిపారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలని శివపాల్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి నైతికత ఉంటే, మరణించిన వారి కుటుంబాలకు కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి అని పేర్కొన్నారు. వారు ప్రభుత్వంలో ఉన్నపుడు 400 నుండి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పుడు, వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంది మరియు ఎటువంటి సమస్యలు లేవు అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తులు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు .
తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు మరియు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు సహాయం చేయడానికి స్థానిక యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, పరిస్థితికి సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.