ఇన్ఫ్యూషన్ నర్సింగ్ సొసైటీ (INS) తమ 12వ వార్షిక సమావేశాన్ని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించింది. “అన్లీషింగ్ పవర్ ఆఫ్ ఇన్ఫ్యూషన్: నర్సింగ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్కేర్” అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో ఇన్ఫ్యూషన్ థెరపీ మరియు నర్సింగ్ కేర్ రంగంలో పురోగతి, ఉత్తమ ప్రాక్టీస్లు, కొత్త ఆవిష్కరణలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కార్యక్రమంలో డాక్టర్ దిలీప్ కుమార్ కీలకోపన్యాసం చేశారు. రోగి భద్రత మరియు వైద్య ఫలితాలను మెరుగుపరచడంలో ఇన్ఫ్యూషన్ నర్సుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ రంగంలో ఐఎన్ఎస్ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ సమావేశంలో INS ఇండియా ప్రెసిడెంట్ కల్నల్ బిను శర్మ, INSCON 2024 చైర్పర్సన్ డాక్టర్ జోతి క్లారా మైఖేల్, డాక్టర్ అమర్ బిరాదర్, మరియు INS చాప్టర్ హెడ్ జి.సి. తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 1200 మందికి పైగా హాజరయ్యారు.
సదస్సులో భాగంగా వర్క్షాప్లు, చర్చలు, మరియు శాస్త్రీయ సెషన్లు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో బీడీ మాస్టర్మైండ్ క్విజ్, పేపర్ ప్రెజెంటేషన్లు, వీడియో పోటీలు, ఈ-పోస్టర్లు, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్లు వంటి పోటీల ద్వారా ప్రతిభను ప్రదర్శించేందుకు ప్లాట్ఫాం అందించారు.
కార్యక్రమానికి ముగింపుగా డాక్టర్ లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ టి. దిలీప్ కుమార్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశం ఇన్ఫ్యూషన్ నర్సింగ్ రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించడంలో కొత్త దిశలను సృష్టించడంలో దోహదపడింది.