మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

హామీలపై సమాధానం చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి .?: బండి సంజయ్

హైదరాబాద్‌: రాష్ట్రానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 6 గ్యారంటీలకు సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని… ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు.

హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. వాటిని అమలు చేయకుండా ఈ రోజు తెలంగాణకు వస్తున్నారని… అందుకే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ నేతలు అయినా… ఈ దేశంలో తిరిగే హక్కు ఉందని… కానీ హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాహుల్ గాంధీపై ఉందన్నారు.

నా పాదయాత్రలో మూసీ వద్దకు వెళ్లిన. విషం కక్కుతున్న నీళ్లను కళ్లారా చూసిన. ఆ విషపు నీటి కోరల్లో చిక్కుకుని యాదాద్రి జిల్లా ప్రజలు ఏ విధంగా విలవిల్లాడుతున్నారో.. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగు నీటి కోసం నీళ్లు కొనుక్కొని, వాటర్ ప్లాంట్ ద్వారా తెచ్చుకునేందుకు ఏ విధంగా బాధలు పడుతున్నరో చూసిన. మూసీని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుండి కోరుతోంది. కానీ ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దన్నదే మా డిమాండ్. అట్లాగే మూసీని అడ్డుపెట్టుకుని లక్షన్నర కోట్ల దోపిడీని ఆపాలన్నదే మా డిమాండ్. 15 వేల కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకోవడానికి మేం వ్యతిరేకం. తెలంగాణ నిండా అప్పుల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని మీ మంత్రులే మొత్తుకుంటున్నరు. ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది జీతాలకే ఇబ్బందిగా ఉందని చెబుతున్నరు. అట్లాంటప్పుడు మళ్లీ లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంత వరకు కరెక్ట్? కాంగ్రెస్ అగ్రనేత కుటుంబానికి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడతారా? కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంటే.. మీరు లక్షన్నర కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా? అని ప్రశ్నించారు.

Related Posts
పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు
New Income Tax Bill before Parliament

లోక్‌సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు..విపక్షాలు వాకౌట్ న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో 'నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025'ను Read more

ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీలో టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి కీలక సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. Read more

వరంగల్‌కు విమానాశ్రయం: సీఎం రేవంత్
revanth reddy

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధివైపుకు పరుగులు తీస్తోంది. తాజాగా వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వ‌రంగ‌ల్ (మామునూరు) Read more

ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు
rain

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో జనజీవనం అస్తవ్యస్తమైనది. బంగాళాఖాతంలో ఏర్పడిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *